రాజన్న సిరిసిల్ల : అక్రమంగా భూమిని తన పేరా పట్టా చేసుకున్నాడని ఓ వ్యక్తిని పంట పొలంలోనే కట్టేశారు. ఈ సంఘటన సిరిసిల్ల రూరల్తం గళ్లపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. దేశాయి పల్లె గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తి గట్టు లింగారెడ్డికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో కిషన్ రెడ్డిని వ్యవసాయ పొలం వద్ద లింగారెడ్డి కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టేశారు. మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన భూమిని తనకు చేయడం లేదంటూ లింగారెడ్డి ఆరోపించారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే నా భూమిని కిషన్ రెడ్డికి చేశారని బాధితుడు లింగారెడ్డి తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు