ఎప్పుడూ ఆకాశంలో కనపడే తెల్లని మేఘాలు ఒక్కసారిగా నేలను తాకినట్లుగా కనిపించాయి. కొండలను మేఘాలు ముద్దాడుతున్నట్లు కనిపించిన ఈ అందమైన దృశ్యం ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్ మండల కేంద్రం సమీపంలో దర్శనమిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసి వెలిసిన తరువాత కొండలను ఇలా మేఘాలు తాకుతున్నట్లు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.