నల్లగొండ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. నకిరేకల్, కోదాడ, దేవరకొండ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రమావత్ రవీంద్రకుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కట్టంగూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పిట్టంపల్లి సర్పంచ్, ఎంపీటీసీ పనస సైదులు, పాలడుగు హరికృష్ణ, అయిటిపాముల ఎంపీటీసీ-2 నలమాద వీరమ్మసైదులు ఆధ్వర్యంలో 400 మంది నాయకులు కార్యకర్తలు ఆదివారం పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంతో టీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన యువకులు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చందంపేట మండలం కాట్రావత్ తండా నుంచి పలు పార్టీలకు చెందిన 80కుటుంబాలు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి