హైదరాబాద్: నగర శివార్లలోని జవహర్నగర్లో దారుణం చోటుచేసుకున్నది. జవహర్నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో ఆరేండ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. దమ్మాయిగూడకు చెందిన శ్రీను.. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన ఆరేండ్ల బాలికను ఎత్తుకెళ్లాడు. ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇవాళ ఉదయం ప్రగతినగర్లో వదిలిపెట్టాడు. గమనించిన స్థానికులు శ్రీనును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆ చిన్నారిని గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.