మహబూబ్నగర్ : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించి తీరాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మహబూబ్ నగర్ పట్టణంలో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు,ఆటోలు, కార్లను ఆపి వాహన దారులతో మాట్లాడారు.
అనవసరంగా ఎవరు బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి ఉన్నవారు, వైద్య చికిత్స కోసం వచ్చే వారు మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చేవారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు.
సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వెంట తెచ్చుకునాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటకు వచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
అంతకుముందు మంత్రి జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ వార్డు బయట ఉన్న రోగుల సహాయకులతో, కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. మంత్రి వెంట జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, డాక్టర్ జీవన్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత