ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో ఉయ్యాల వంతెన తోపాటు కాటేజీలలోకి నీళ్లు చేరాయి. లక్నవరం సరస్సు జలశోభను సంతరించుకొని కనువిందు చేస్తున్నది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ముందుస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులను అధికారులు అనుమతించడంలేదు.
ఇవి కూడా చదవండి..
Wanaparthi : సరళాసాగర్కు జలకళ
మార్స్ గ్రహంపై రాళ్లను సేకరించిన నాసా రోవర్
Lmd Reservoir : ఎల్ఎండీకి భారీగా ఇన్ఫ్లో