కరీంనగర్ : కరీంనగర్ : ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 18 గేట్ల ద్వారా లక్షా 76 వేల 706 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మోయ తుమ్మెద వాగు నుంచి 69వేల 278 క్యూసెక్కులు, మిడ్ మానేరు నుంచి లక్షా 7 వేల 433 క్యూసెక్కులు, ఇతర క్యాచ్మెంట్ ఏరియా నుంచి 300 క్యూసెక్కుల నీరు మొత్తం లక్షా 77 వేల 011 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రూపంలో రిజర్వాయర్కు వస్తుంది.
ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్లో 24.034 టీఎంసీలకు గాను 22.539 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రిజర్వాయర్లోకి లక్షా 77వేల 011 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రూపంలో రావడంతో 18 గేట్ల ద్వారా మానేరు వాగులోకి లక్షా 76వేల 706 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కాగా, తాగునీటి అవసరాలకు 305 క్యూసెక్కులు మొత్తం లక్షా 77వేల 011 క్యూసెక్కులు అవుట్ ఫ్లో రూపంలో బయటికి వెళ్తుండగా భారీ వర్షాల కారణంగా కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటిని నిలిపివేశారు.