హూస్టన్: మార్స్ గ్రహంపై ఉన్న రాళ్లను నాసా కలెక్ట్ చేసింది. ఆ గ్రహం మీదకు పంపిన పర్సీవరెన్స్ రోవర్ ఆ రాళ్లను సేకరించినట్లు నాసా వెల్లడించింది. ప్రస్తుతం ఆ రాళ్లను.. టైటానియంతో తయారు చేసిన శ్యాంపిల్ ట్యూబ్లో ఉంచారు. భవిష్యత్తులో మళ్లీ మార్స్ గ్రహం మీదకు వెళ్లే మిషన్ల ద్వారా ఆ రాళ్లను భూమిపైకి తీసుకురానున్నారు. రాళ్ల ఫోటోలను స్పేస్ ఏజెన్సీ నాసా తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పెన్సిల్ కన్నా కాస్త పెద్దగా ఉన్న ఓ ట్యూబ్లో ఆ రాళ్లను ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ శ్యాంపిల్ను కలెక్ట్ చేశారు. మార్స్ గ్రహం మీద నుంచి సేకరించిన ఆ రాళ్లను పర్సీవరెన్స్ తర్వాత వాటిని రోవర్ ఇంటీరియర్ భాగంలోకి పంపించింది. ఇదో చరిత్రాత్మక ఘనత అని నాసా డైరక్టర్ బిల్ నెల్సన్ తెలిపారు. జెజిరో క్రాటర్ నుంచి సేకరించిన ఆ శ్యాంపిళ్ల డేటా కాలిఫోర్నియాలోని జేపీఎల్ ల్యాబ్కు చేరింది.