Ramagundam CP : రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని వాహన రవాణ కార్యాలయాన్ని (MTO) పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ambar Kishor Jha) సందర్శించారు. శుక్రవారం ఆయన ఎంటీవోలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటీవో కార్యాలయ పరిసరాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎంటీవో కార్యాలయంలో అకస్మిక తనిఖీలు నిర్వహించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. ఆవరణ, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి బ్యారక్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు ప్రభుత్వ వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు.
ఎంటీవో కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని, పరిశుభ్రమైన వాతావరణం సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందని సిబ్బందితో పోలీస్ కమిషనర్ తెలిపారు.