హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Project ) కు భారీగా వరద ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టుకు 2,32,939 క్యూసెక్కుల నీరు వస్తుండగా 7,493 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 139 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
అదే విధంగా తుంగభద్ర జలాశయం పూర్తి నీటి నిల్వ 105.78 టీఎంసీలకు గాను ప్రస్తుతం 64.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,750 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.