(Jagadish Reddy) న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యం కొంటారో లేదో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ అధికారులకు ధాన్యం సేకరణకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందుకే రాతపూర్వకంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెప్తున్నది. కానీ, ఎఫ్సీఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అంటున్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చింది. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా పంట పండింది. అందుకే అదనపు కొనుగోళ్లు చేయాలని కోరుతున్నాం. 40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగింది. మేము మిల్లు పట్టి ఇస్తే, కేంద్రం తీసుకోవాలి. అయితే, ఈ టార్గెట్ పూర్తయింది. ఇంకా మార్కెట్ యార్డుల్లో, పంట కల్లాల్లో, కోతలు ఇంకా పూర్తికాని వరి ఉంది. బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయం. కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం మీకు సాధ్యం కాదు. రెండ్రోజుల్లో చెప్తాం అన్నందుకే మేమంతా ఢిల్లీలో ఆగాం. ఉత్తరం ఇస్తే మేమెందుకు ఢిల్లీలో ఉంటాం. ఇస్తే వెళ్లిపోయేవాళ్ళం కదా?’ అని అయన అన్నారు.
‘రూ.16 వేల కోట్ల కుంభకోణం అంటున్న కాంగ్రెస్ నేతలు.. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారు.కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ. ఓ నాయకుడు కూడా లేడు ఆ పార్టీకి. రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు. ఎవరు రైతుల కోసం పని చేస్తున్నారు. ఎవరు చేయడం లేదనే విషయాలను తెలంగాణ సమాజం చూస్తోంది.
బీజేపీకి తోక పార్టీ మాదిరిగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. 40 లక్షల టన్నుల బియ్యానికి ఎంవోయూ చేసినోళ్లు.. అదనపు సేకరణపై లెటర్ ఇవ్వడానికి ఎందుకు వెనక్కిపోతున్నారు? ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. పీయూష్ గోయల్ వ్యాపారుల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2014 తర్వాత వ్యవసాయం రంగం ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలి. రైతుల నుంచి తన్నులు తప్పించుకునేందుకు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు’ అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..