వరంగల్ అర్బన్ : ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ భారీ వర్షాల వరద ముంపుపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియెజకవర్గ ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ నగర కార్పొరేషన్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ప్రజలను దగ్గర లోని ఫంక్షన్ హల్ లో ఉంచి వారికి అన్ని సదుపాయాలు అందించాలన్నారు.
వరదల ఉధృతి పై ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. జలమయమైన ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 1800-425-1115 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించి ప్రజాప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సమావేశంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వేంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిర్మల్ వర్ష ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు