కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా రవాణా చేస్తున్న కలపను(Wood seized) అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్(Asifabad) రేంజ్ అధికారి గోవింద్ సింగ్ సర్దార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలపను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆసిఫాబాద్ రేంజ్ పరిధి దంతన్పల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. కౌటన్ మొవాడ్ నుంచి మందమర్రి వైపు వెళ్తున్న కారును ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. నిందితులు కారు వదిలి పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారితో పాటు పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు కుంసోత్ కృష్ణ, బానోత్ శంకర్ ను అరెస్ట్ చేశామన్నారు. తనిఖీల్లో 12 కలప దుంగలు పట్టుబడుగా వాటి విలువ సుమారు రూ.56,236 ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో సెక్షన్ అధికారులు మహేందర్, సాయి, విజయ్, బీటు అధికారులు ప్రకాష్, సాదిక్, వెంకటేష్, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.