బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా వారసులకు ఎప్పుడూ కొదవ లేదు. తరాలకు తరాలు హీరోలుగా వెలిగిపోతుంటారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో మూడోతరం వారసుడు అడుగుపెట్టబోతున్నాడు. తన మనవడు రాజ్వీర్ డియోల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ధర్మేంద్ర ట్వీట్ చేశాడు. నటుడు సన్నీ డియోల్ కొడుకే ఈ రాజ్వీర్ డియోల్. అతన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ బాలీవుడ్కు పరిచయం చేయబోతోంది. రాజ్వీర్ ఎంట్రీ గురించి చెబుతూ తనపై, తన కొడుకులు సన్నీ, బాబీ డియోల్లపై కురిపించిన ప్రేమనే అతనిపైనా కురిపించాలని ధర్మేంద్ర కోరాడు. అటు ప్రముఖ దర్శకుడు సూరజ్ బార్జాత్యా కొడుకు అవ్నీష్ బార్జాత్యా ఇదే మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. అటు రాజశ్రీ ప్రొడక్షన్స్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రానున్నట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి..