హుజూరాబాద్ ఎన్నికలు ఒక గరోభోడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్నాయి. గరోభోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ధనవం తుడు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఆసామి రాజేందర్ అయితే.. గుంటల్లో భూమిన్నోడు శ్రీనివాస్. ఇప్పుడు శ్రీనివాస్కు టికెట్ రావడం యాదవులకే కాదు.. యావత్తు పేదలకు ఒక అవకాశం వచ్చిందని నేను భావిస్తున్న. పేదోడికి అవకాశం ఇస్తే.. గెలిపించి చూపించాల్సిన అవసరమున్నది. అప్పడే మరో గరీభోడికి టికెట్ వస్తుంది. అందుకే అందరూ ఆలోచన చేయాలి. పేదింటి బిడ్డను గెలిపించాలి. జక్కుల నాగరాజు, యాదవ కుర్మ మహాసభ నాయకుడు
గత ప్రభుత్వాలు గొల్ల,కుర్మలను ఓటర్లుగా చూశాయే తప్ప ఏ గౌరవం ఇవ్వలే. కానీ స్వరాష్ట్రంలో ఒక్క కేసీఆర్ మాత్రమే మా జీవితాల్లో వెలుగులు నింపు తుండు. అన్ని రంగాల్లో అవకాశాలు ఇస్తుం డు. రాజకీయంగా పెద్దపీట వేస్తుండు. శ్రీనివాస్ యాదవ్ నియామకం చాలా సంతోషంగా ఉంది. అందరం ఏకతాటిపై ఉండి గెల్లును గెలిపించుకుంటం. టీఆర్ఎస్కు బ్రహ్మాండమైన మెజార్టీని అందిస్తాం. శ్రీనివాస్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నడు. ఆయనకు టికెట్ ఇవ్వడం సమంజసమే. ఈ ఎన్నిక కోటీశ్వరుడు.. మధ్యతరగతికి మధ్య జరుగుతున్న సంగ్రామం. అందరూ సహకరించాలె. – గోవిందుల భాస్కర్, గొల్ల, కుర్మల నాయకుడు, ఇప్పల్నర్సింగాపూర్.