హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రాష్ట్రంలో పర్యటించింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్లోని మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించింది.
అందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల బీసీ కమిషన్ చైర్మన్లు జయప్రకాష్ హెగ్డే, వకళాభరణం కృష్ణ మోహన్ రావు మొక్కలు నాటారు.
వారి వెంట బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, ఇరు రాష్ట్రాల కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, CH,ఉపేంద్, రాజశేఖర్, కళ్యాణ్ కుమార్, సువర్ణ కేటీ, అరుణ్ కుమార్, గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా