పెద్దపల్లి : ప్రభుత్వ దవాఖానలపై భరోసా కల్పించే విధంగా వైద్య సేవలు అందించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం కరోనా చికిత్స, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో జూమ్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మొదటి విడత ఫీవర్ సర్వే విజయవంతంగా నిర్వహించామన్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందించామని, దీని ద్వారా కొవిడ్ వ్యాప్తిని తగ్గించుకో గలిగామని మంత్రి తెలిపారు.
ఫీవర్ సర్వే సత్ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో రెండో విడత ఇంటింటి సర్వేలో ప్రజాప్రతినిధులు సైతం భాగస్వామ్యం చేస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే అవసరమైన మేర ఐసొలేషన్ కేంద్రాలు ప్రారంభించాలన్నారు.
అవసరమైన మందులు ఆక్సిజన్, రెమిడిసివిర్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా చికిత్స ఫీజులపై నియంత్రణ ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుందని, జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దాదాపు 15 వేల కేసులు నమోదు చేశామని డీసీపీ రవీందర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం