జోగులాంబ గద్వాల : రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద మంజూరైన వ్యవసాయ పనిముట్లను గట్టు మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన పనిముట్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ సక్రియ నాయక్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం