వరంగల్ రూరల్ : కరోనా బాధితులకు మనోధైర్యమే మందని, వారిలో మనోనిబ్బరాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కరోనా నివారణకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు.