హైదరాబాద్ : (Guguloth Shankar Naik) ఆత్మగౌరవంతోనే బానిసత్వం అంతం అవుతుందని నమ్మి.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అధిగమించి ఉన్నత చదువుల వైపు సాగాడు గుగులోతు శంకర్ నాయక్. తండాలో పుట్టిపెరిగి ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరి పరిశోధన దిశగా అడుగులు వేసి డాక్టరేట్ సాధించాడు. ‘గిరిజన సాంస్కృతిక జీవన చిత్రం’ అనే అంశంపై తెలుగు భాషా విభాగ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని బావాజీ గూడం భోజ్య తండాకు చెందిన భాగ్య నాయక్, సాలమ్మ దంపతులకు మూడో సంతానం శంకర్ నాయక్. ఇదే గ్రామంలో రెండో తరగతి వరకు చదివారు. 3 నుంచి 7 వ తరగతి వరకు సీతారాంపురంలో, 8-10 వరకు మరిపెడ హైస్కూల్లో, మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పూర్తిచేశారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదివిన శంకర్ నాయక్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తిచేసి, తెలుగు విశ్వ విద్యాలయంలో ఎంఫిల్ చదివారు.
అతి చిన్న వయసులోనే ఆర్టీఐ కమిషనర్గా ఎదిగిన వ్యక్తిగా శంకర్ నాయక్ నిలిచారు. మారుమూల గిరిజన తండా నుంచి వచ్చి డాక్టరేట్ పట్టా సాధించి గిరిజనులకు దిక్సూచిలా నిలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్ధిగా, ఉద్యమ నాయకుడిగా విద్యార్థుల్లో చైతన్యం నింపి స్వరాష్ట్ర గొప్పతనం గురించి తెలియజేశారు. ఎన్సీసీలో క్రమశిక్షణ కలిగిన సీనియర్ అండర్ ఆఫీసర్గా గుర్తింపు పొందారు. గిరిజన కెరటం మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులుగా కూడా సేవలందించారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ-ఓయూ విభాగం అధ్యక్షుడిగా,
గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. శంకర్నాయక్ ఉస్మానియా విద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకోవడం పట్ల పలువురు విద్యార్థి ఉద్యమకారులు, బంజారా సంఘాల నేతలు, విద్యార్థులు ఆయనను అభినందించారు.
పెగాసస్ కేసులో ‘సుప్రీం’ ఆదేశాలు భేష్..! పార్లమెంట్లో చర్చించాల్సిందే : రాహుల్గాంధీ
ఈ పరీక్షతో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించొచ్చు.. ఎడిన్బర్గ్ పరిశోధకుల అభివృద్ధి
షోయాబ్ అక్తర్కు అవమానం.. లైవ్ షో నుంచి వెళ్లిపొమ్మన్న హోస్ట్.. ఎందుకంటే?
మడగాస్కర్ అడవుల్లో బుల్లి ఊసరవెల్లి
రామ్దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..