వాషింగ్టన్ : (Americans) అమెరికా పౌరులు ఇంకా దాదాపు 450 మంది ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండిపోయారు. వారి గురించి పెంటగాన్ ఆందోళన చెందుతున్నది. భద్రతా దళాలు ఉపసంహరించుకున్న దాదాపు రెండు నెలల తర్వాత ఇంకా 450 మంది వరకు అమెరికన్ పౌరులు ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోయారని పెంటగాన్ అంచనా వేసింది. వీరంతా ఆ దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాచారాన్ని సెనేట్లో పెంటగాన్ బహిరంగపరిచింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోయిన వారిలో చాలా మందితో అమెరికా సంప్రదింపులు జరుపుతున్నదని కూడా వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న 363 మంది అమెరికన్లతో అధికారి సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కోలిన్ ఖాల్ తెలిపారు. వీరిలో దాదాపు 176 మంది అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారని ఖామా ప్రెస్ రిపోర్ట్ పేర్కొన్నది. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్నప్పటికీ ఆ దేశం విడిచిపెట్టడానికి ఇష్టపడనివారు లేదా అమెరికా రావడానికి సిద్ధంగా లేనివారు దాదాపు 243 మంది అమెరికన్లు ఉన్నారు. 200 మందికి మించి అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్లో లేరని జో బైడెన్ ప్రభుత్వం ఇంతకుముందు వెల్లడించింది. భద్రతా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘాన్లోని తాలిబాన్తో అమెరికాకు ప్రత్యక్ష సంభాషణలు ఇంతవరకు జరుగలేదు. ఇటీవలి మాస్కో ఫార్మాట్లో కూడా అమెరికా పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ దేశ పౌరులను తరలించేందుకు అమెరికా పాకిస్తాన్, ఇరాన్, ఖతార్ దేశాల సాయం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..