(Heart Attack and Banana) ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న జబ్బుల్లో హార్ట్ ఎటాక్ ఒకటి. హార్ట్ ఎటాక్ రావడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్నేండ్ల కింద వరకు కేవలం వృద్ధులు, ఊబకాయులకు గుండెపోటు వచ్చేది. అయితే, ఇప్పుడు మారిన జీవనశైలితో యువకుల్లో కూడా గుండెజబ్బులు కనిపిస్తున్నాయి. గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు నిత్యం ఒక అరటి పండు తినడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. ప్రతి రోజు ఒక అరటి పండు తినేవారు గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చని వారు సెలవిస్తున్నారు.
మిగతా పండ్లలో కంటె ఎక్కవ పోషకాలు అరటి పండులో లభిస్తాయి. అరటిపండ్లలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి ఉంటాయి. శక్తికి మంచి ప్రత్యామ్నాయంగా కూడా వైద్యులు సూచిస్తుంటారు. ప్రతిరోజు అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీనిలో ఉండే పొటాషియం ధమనులు మూసుకుపోకుండా చూస్తుంది. అయితే తాజా పండ్లను తినడం శ్రేయస్కరమని అధ్యయనకారులు సూచిస్తున్నారు. మహిళలకు పీరియడ్స్, గర్భం కారణంగా శరీరంలో ఐరన్, కాల్షియం వంటి లోపాలు లేకుండా అరటి పండు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అలబామా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, అరటిపండ్లు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం మీడియం సైజ్ అరటి పండు ఒకటి తినడం వల్ల శరీరానికి 9 శాతం పొటాషియం అందుతుంది. అరటి పండు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. హృదయనాళ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..