తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాగా, గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఆయనకు పరీక్షలు చేయించగా పాజిటివ్గా తేలిందని గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. దీంతో 77 ఏండ్ల చాందీని తిరువనంతపురంలోని దవాఖానకు తరలించే అవకాశం ఉన్నది. ఊమెన్ చాందీ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఆకాంక్షించారు.
కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం కన్నూరునోని తన నివాసంలో ఉన్నారని అధికారులు తెలిపారు. విజయన్ గత నెల 3న కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా తిరిగారు.
నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతాను. గత కొద్దిరోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి, స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలలని సీఎం సూచించారు. ఈ మేరకు విజయన్ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..