న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్రధాని మోదీ అన్నారు. వైరస్పై పోరులో రాబోయే 2-3 వారాలు చాలా కీలకమన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్పై మోదీ గురువారం అన్ని రాష్ర్టాల సీఎంలతో సమీక్ష నిర్వహించారు. ‘మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి అయిన ఈ నెల 11 నుంచి 14వ తేదీల మధ్య ఎంతమందికి వీలైతే అంతమంది అర్హులకు టీకాలు ఇవ్వాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని టీకా పండుగగా ప్రధాని అభివర్ణించారు. కరోనా కట్టడి కోసం రాత్రి పూట విధిస్తున్న కర్ఫ్యూను కరోనా కర్ఫ్యూ అనాలని ఫలితంగా ప్రజల్లో కరోనాపై అవగాహన పెరుగుతుందని అన్నారు. ఏడాది కాలంగా కరోనాపై యుద్ధం చేస్తున్నా కూడా అలసత్వాన్ని దరిచేరనీయవద్దని మోదీ పిలుపునిచ్చారు. 2-3 వారాలు కట్టడి చర్యలను కఠినంగా అమలు చేయాలన్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
రెండో డోసు తీసుకున్న ప్రధాని
ప్రధాని మోదీ కొవిడ్ టీకా కొవాగ్జిన్ రెండో డోసును గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో వేసుకొన్నారు. 45 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరు టీకా వేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మార్చి 1న మోదీ ఎయిమ్స్లోనే కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
ఈసీ 10 నోటీసులిచ్చినా లెక్క చేయను