SP Chief : సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్వాదీ పార్టీకి ఎంతో పట్టున్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మూడు సార్లు విజయం సాధించారు.
ఇక 2012, 2014 ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్ యాదవ్ గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పాథక్ చేతిలో ఆమె ఓటమి చవిచూశారు. నామినేషన్ దాఖలు అనంతరం ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ ఎస్పీ చేపట్టిన అభివృద్ధిని బీజేపీ ఉద్దేశపూర్వకంగా నిలువరిస్తోందని ఆరోపించారు.
బీజేపీ నెగెటివ్ రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజలను పదేపదే అవమానిస్తోందని ఆరోపించారు. కన్నౌజ్ ప్రజలకు సేవలందించేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఎస్పీ హయాంలో కన్నౌజ్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని అన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ మేనల్లుడు, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడైన మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలే ప్రకటించాయి. ఇక పార్టీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేశ్ పోటీలో ఉండాలని నిర్ణయించారు.
Read More :
Aadhaar PAN Link | మే 31కల్లా ఆధార్తో పాన్ లింక్ అవ్వాలి.. అలాగైతేనే చర్యలుండవ్: ఐటీ శాఖ