ఇండ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం కొందరికి ఇష్టంగా ఉంటుంది. ఈ పెంపుడు జంతువులకు కుటుంబ సభ్యుల కంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి జంతువులకు ఏదైనా ప్రమాదం సంభవించినా, అదృశ్యమైన వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది.
థాయిలాండ్కు చెందిన ఓ కుటుంబం గత కొంతకాలం నుంచి ఓ పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పిల్లి ఆచూకీ కోసం ఇల్లంతా గాలిస్తున్నారు. ఇంట్లోని ఓ బాలికకు తమ గది స్లాబ్ మీద భారీ కొండ చిలువ కనిపించింది. కొండచిలువను చూసిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో ఆమె తల్లి అక్కడికి వెళ్లి చూడగా, ఆ పిల్లిని కొండచిలువ మింగినట్లు గుర్తించింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు కొండచిలువను బంధించారు. అయితే దాని కడుపులో ఉన్న కొండచిలువను బయటకు తీయడం కష్టమని అధికారులు చెప్పడంతో.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.