Omicron cases in Telangana | తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు.
ఇప్పటివరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9122 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. 59 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. వీరిలో 24 మందికి ఒమిక్రాన్ వేరియంట్గా తేలింది. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 172 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3625 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron | దేశంలో ఒమిక్రాన్ విజృంభణ.. 200కు పెరిగిన కేసులు
Omicron | బూస్టర్ డోస్ తీసుకున్న ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron | అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
Omicron | రాజన్న సిరిసిల్లలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు