హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. మూడు సంవత్సరాల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.6 కోట్ల మార్క్ను దాటింది.
మంగళవారం ఒక్కరోజే భక్తులు హుండీలో ఏకంగా రూ.6.12 కోట్లను కానుకలుగా సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మరోవైపు గతంలో ఎన్నడూలేని విధంగా జూలైలో శ్రీవారికి రూ.140.28 కోట్ల ఆదాయం వచ్చింది.