హైదరాబాద్: రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. కార్పొరేషన్లలో కాస్త నెమ్మదించింది. ఉదయం 11 గంటల వరకు గ్రేటర్ వరంగల్లో 23.62 శాతం పోలింగ్ నమోదవగా, ఖమ్మం కార్పొరేషన్లో 23.41 శాతం, జీహెచ్ఎంసీలో భాగమైన లింగోజిగూడ డివిజన్లో 12.52 శాతం మాత్రమే నమోదయ్యింది. కాగా, సిద్దిపేట మున్సిపాలిటీలో 31.39 శాతం, నకిరేకల్లో 45.55 శాతం, అచ్చంపేటలో 34 శాతం, జడ్చర్లలో 23 శాతం, కొత్తూరులో 43.99 శాతం చొప్పున నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..