అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. ప్రతిరోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయి రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు కూడా కొరత ఏర్పడి పలువురు రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో విదేశాల నుంచి, దేశంలోని పలు స్టీల్ ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ చేరవేస్తున్నారు. అంతేగాక ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు.
అందులో భాగంగానే గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా ప్రత్యేకంగా కొవిడ్ ఆస్పత్రిని నెలకొల్పారు. పీఎం కేర్స్ కొవిడ్ హాస్పిటల్ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రి కోసం ప్రత్యేకంగా 57 మంది సభ్యులతో కూడిన నేవీ వైద్య బృందాన్ని కేటాయించారు. ఈ 57 మందిలో నలుగురు వైద్యులు, ఏడుగురు నర్సులు, 26 మంది పారా మెడికల్ సిబ్బంది, మరో 20 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. ఈ వైద్య బృందం రెండు నెలలపాటు అక్కడ సేవలు అందించనున్నది. అవసరమైతే వ్యవధిని మరికొంత కాలం పొడిగించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం