ముంబై: మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరో రెండు వారాలకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడంలేదని, అందుకే ఆంక్షలను మరో రెండు వారాలకు పొడిగించాలని నిర్ణయించామని తెలిపింది.
తాజా నిర్ణయం ప్రకారం మహారాష్ట్రలో మే 15 వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతాయని మహా సర్కారు పేర్కొన్నది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఏప్రిల్ 21న బ్రేక్ ది చెయిన్ క్యాంపెయిన్ కింద రాష్ట్రవ్యాప్తంగా మే 1 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రేపటితో ఆ గడువు ముగుస్తున్నా కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఆంక్షలను మరికొంతకాలం పొడిగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం