ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 5: నాయీ బ్రాహ్మణులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్షౌరశాలలకు 250యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించడం పై జగిత్యాల పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు రాచర్ల విజయ్, కార్యదర్శి గంగిపెల్లి వేణుమాధవ్, కోశాధికారి రాచమల్ల శ్రీనివాస్, డైరెక్టర్లు నరేశ్, అశోక్, సత్యం, లక్ష్మీనారాయణ, నాయకులు మానాల కిషన్, బుచ్చిరాజం, అంజయ్య, కిష్టయ్య, భూపతి, గణేశ్, గంగాధర్, రాజేశం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..