World Forest Day | మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో దోహదపడతాయి. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, పెంపకంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ‘హరితహారం’ (HarithaHaaram) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంకై నడుం బిగించింది. కాగా, ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Mp Santosh Kumar) అన్నారు. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణం. అందులోని ప్రతి బిట్ను సేవ్ చేయడానికి మనం చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. అడవులు లేకపోతే ఈ భూమి ఓ నిర్జీవంతో సమానం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm KCR) సర్.. హరితహారం (HarithaHaaram) ఎంతో సహకరిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు గతంలో మొక్కలు నాటిన ఫొటోలను ఎంపీ షేర్ చేశారు.
Forests, the home to around 80% of the terrestrial biodiversity of the world. It’s high time for us to join hands to save every bit of it, coz, without them, this planet is a dead piece. Honble CM Sri KCR sir’s #HarithaHaaram highly contributing.#WorldForestDay 🌳 pic.twitter.com/Oocg5jQlwM
— Santosh Kumar J (@MPsantoshtrs) March 21, 2023
Also Read..
Tulip Garden | శ్రీనగర్లో కనువిందు చేస్తున్న తులిప్ అందాలు.. ఫొటోలు వైరల్..!
Kota Srinivasa Rao | నేను బతికే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు
Paul Grant | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
Rupert Murdoch | 92 ఏండ్ల వయసులో.. ఐదో పెండ్లికి సిద్ధమైన బిలియనీర్