హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గురువారం అరణ్య భవన్లో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అటవీ ఉద్యోగులు ఈ వైరస్ భారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇప్పటి వరకు ఎంత మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు? ఎంతమందికి కరోనా వైరస్ సోకింది? ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది అటవీ ఉద్యోగులు మరణించారు? అని మంత్రి ఆరా తీశారు. అటవీ శాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నుంచి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పీసీసీఎస్) ఆర్. శోభను ఆదేశించారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అందరికీ వాక్సిన్ ఇచ్చేలా జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత యేడాది నుంచి అటవీ శాఖలో 236 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారని, ఇప్పటి వరకు 11 మంది మరణించారని పీసీసీఎఫ్ తెలిపారు.
అటవీ ఉద్యోగులు, సిబ్బంది మరణాలపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. వైద్యం, ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య ఉన్నా అరణ్య భవన్ కు సమాచారం అందిస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్