KTR | హైదరాబాద్ : ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని మన అందరికీ తెలుసు అని కేటీఆర్ తెలిపారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఎంతో ఘనమైనది. నాడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తరలించడంతో.. నిమ్స్ కదన రంగంగా మారిపోయిన పరిస్థితి. మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి. కాబట్టి నవంబర్ 29న నిమ్స్ హాస్పిటల్లో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
దీక్షా దివస్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్నాను. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
KTR | 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కేసీఆర్ : కేటీఆర్
KTR | నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్