Khammam | ఖమ్మం : ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ క్వాష్ పిటిషన్పై కాంగ్రెస్ నేతల అబద్ధపు ప్రచారం.. మండిపడ్డ బీఆర్ఎస్