Harish Rao | హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏండ్ల క్రితం నవ చరితకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజది. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం ట్వీట్ చేశారు. ‘చరిత్ర సృష్టించి 11 ఏండ్లు అయింది. కేసీఆర్ నేతృత్వంలోని ప్రజా ఉద్యమం ఫలితంగా 18-02-2014న లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. నాడు బిల్లు పాసైన తర్వాత జరిగిన సంబురాల ఫొటోను ట్వీట్కు జత చేశారు హరీశ్రావు.
It has been 11 years since history was created.
The people’s movement, led by visionary leader @KCRBRSPresident garu, triumphed when the Telangana Bill was approved in Lok Sabha on 18-02-2014. #Telangana #KCR pic.twitter.com/bYv01oyweg
— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2025
ఇవి కూడా చదవండి..
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
KTR | రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి నిజాయితీ గల్ల మోసగాడు.. కేటీఆర్ సెటైర్లు