Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాల ఊసేలేదు. రేవంత్ సర్కార్ పాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. మరి ముఖ్యంగా కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఉపాధి అవకాశాలు లేనేలేవు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను కోట్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయని, ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెచ్చిన అసలైన మార్పు అని హరీశ్రావు విమర్శించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, 2023-24తో పోలిస్తే 2024-25 జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. ఈ తగ్గుదల రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రభావం చూపిస్తూ, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, తద్వారా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు క్షీణించిందని తెలిపింది. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని హరీశ్రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టప్ తెలంగాణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకుంటుంది. కానీ వాస్తవాలకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. కొత్త కంపెనీల సంఖ్య పడిపోవడం, లక్ష్యాన్ని చేరుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోవడమే కాక ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారింది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన మార్పు అని హరీశ్రావు విమర్శించారు.
Telangana has seen a significant decline in new company registrations from July to September 2024-25 compared to the same period in 2023-24, according to the Ministry of Corporate Affairs latest report.
This drop indicates reduced capital investment, fewer job opportunities, and… pic.twitter.com/NlXayZ247I
— Harish Rao Thanneeru (@BRSHarish) October 29, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరణ.. ఇది తెలంగాణ ప్రజల విజయం : కేటీఆర్