న్యాల్కల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నది.
అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ శివారులోని తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా మహారాష్ట్ర – కర్ణాటక ప్రాంతం నుంచి ధాన్యంతో వాహనాలు రాకుండా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ భరత్ కుమార్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఆయా రాష్ట్రాల నుంచి వరి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పగడ్బందీగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట హద్నూర్ ఎస్ఐ వినయ్ కుమార్, ఏఎస్ఐ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు: రాజ్యసభలో ఆరోగ్యశాఖ మంత్రి
Electric shock | కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే : మంత్రి హరీశ్రావు