Gutta Sukender Reddy | అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి గౌరవ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు శ్రీను యాదవ్ నాగనబోయిన, కరుణాకర్ వంగూరు, శేఖర్ నల్లబోతుల, రవీందర్ గడ్డంపల్లి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ప్రవాసుల సహకారం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడ స్థిరపడిన, ఎంత స్థాయికి ఎదిగిన మన మాతృభూమిని మరచిపోవద్దని సూచించారు. మన రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగువారందరు ముందుకు రావాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు , అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Gutta Sukender Reddy1