హైదరాబాద్ : యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు ప్రభుత్వ కృషితో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై ఇప్పుడు ఉన్న చట్టాలు మాత్రమే సరిపోవని ప్రజలంతా కదలాల్సిన సమయమిదన్నారు. ప్రకృతితో మమేకమై మన జీవన విలువలలో పర్యావరణ పరరక్షణను ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను ధ్వంసం చేయడం, అడవుల్లోని చెట్లను విచక్షణా రహితంగా నరికేయడం వల్ల మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవజాతి వల్ల ఎన్నడు లేనంత స్థాయిలో విశ్వం అంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
కరోనా విపత్తు మానవాళికి నేర్పిన గుణపాఠమని, భావి తరాల కోసం ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం తక్షణమే ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ వినూత్నన కార్యక్రమాలను చేపట్టి తెలంగాణను దిక్సూచిగా నిలిపారన్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కాగా, శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి