ఆర్డీవో బెన్షాలోమ్
బుజూనూర్లో వ్యాక్సినేషన్ శిబిరం పరిశీలన
ఇల్లందకుంట, ఏప్రిల్ 23: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని హుజూరాబాద్ ఆర్డీవో బెన్షాలోమ్ సూచించారు. శుక్రవారం ఇల్లందకుంట పీహెచ్సీ వైద్యురాలు జ్యోత్స్న ఆధ్వర్యంలో బుజూనూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేయగా, ఆర్డీవో పరిశీలించారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న వారితో మాట్లాడారు. వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి ఉధృతి దృష్ట్యా రోజు వారీగా వ్యాక్సిన్ల సంఖ్య పెంచాలన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తప్పక వేయించుకోవాలన్నారు. కాగా, శిబిరంలో 225 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు తెలిపారు. ఇక్కడ సర్పంచ్ సరిగొమ్ముల అరుణ, ఎంపీపీ సరిగొమ్ముల పావని, తహసీల్దార్ సురేఖ, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఐకేపీ సెంటర్ను పరిశీలించిన ఆర్డీవో
జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 23: మండలంలోని తనుగుల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో బెన్షాలోమ్ పరిశీలించారు. రైతులు అధిక తేమ లేకుండా ఆరబెట్టిన వరిధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. అనంతరం లారీల వేబిల్లులు, రైతు పట్టీలను, తేమశాతాన్ని కొలిచే పరికరాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ డాక్టర్ కే నారాయణ, సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీఈవో శ్రీనివాస్, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో మొత్తం 10 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. కల్లోలం సృష్టిస్తున్న మరణాలు
ఫ్లైట్ అటెండెంట్ వీడియో : ఇక విమానాల్లో నీళ్లు తాగాలంటే నీళ్లు నమలాలి!