అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 4441 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,9228కి చేరింది. 9,27,418 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 74231కి పెరిగాయి. 7,579 మంది మృతి చెందారు.