సిద్దిపేట : వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆర్థిక శాఖ మంత్రి
హరీశ్ రావు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో రైతు వేదిక సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఏఈవో శ్రీనివాస్ తో పాటు వ్యవసాయ అధికారులతో వానకాలం పంట కార్యాచరణపై ప్రశ్నించారు. రైతుబంధు పొందిన రైతుల సంఖ్య, ఖాతాలకు జమ అయిన డబ్బులు వివరాలు అడిగారు. అలాగే రైతు బంధుకు సంబంధించి వివరాలు నోటిలో ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.
ప్రతి రైతుకు రైతుబంధు అందాలన్నది ముఖ్యమంత్రి ధ్యేయం అని మంత్రి తెలిపారు.
అర్హులై ఉండి ఏదైనా కారణాలతో రైతుబంధు సహాయం అందకుంటే వారికి రైతు బంధు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వానకాలం పంట కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించి రైతులు వాణిజ్య లాభదాయక పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ