జగిత్యాల : జగిత్యాల పట్టణం మినీ స్టేడియంలో పట్టణ ప్రగతి నిధులు రూ.12లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. త్వరలోనే ఓపెన్ జిమ్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ శ్రావణి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని