జగిత్యాల : జగిత్యాల పట్టణానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 4,20,000 రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మినీ స్టేడియంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ నిరు పేదలకు వరంగా మారిందన్నారు. దవాఖానల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డా.బోగ శ్రావణి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
తలకు గాయం.. హాస్పిటల్లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్