సూర్యాపేట : అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాసులు సూర్యాపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు.
సూర్యాపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు అద్భుతమైన సేవలు అందుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అమెరికాలోని ప్రవాసులు మరింత అభివృద్ధికి గాను ఆర్థిక సహాయం అందించడాన్ని ఆయన స్వాగతించారు. అమెరికాలోని టీడీఎఫ్ (తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్) ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ పేషేంట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఐసీయూ కేంద్రానికి కావాల్సిన 10 బెడ్లు, ఐదు మానిటర్లు, రెండు వెంటిలేటర్లతో పాటు రెండు సిరంజీ పంపులు ఐసీయూకి కావాల్సిన పూర్తి మెటీరియల్ను టీడీఎఫ్ ప్రతినిధులు సమకూర్చారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సామాన్యుడికి అందుబాటులోకి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
దారుణం : భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడి హత్య
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ