జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని టి 2 క్వార్టర్స్లో నివాసముండే సింగరేణి కార్మికుడు నాగభూషణం దారుణ హత్యకు గురయ్యాడు. నాగభూషణం భూపాలపల్లి లోని కేటీకే ఒకటో గనిలో ట్రామర్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాగభూషణంను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి పూర్తి విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు.