హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరు, విశాలాంధ్రకు చాలాకాలం జనరల్ మేనేజర్గా పనిచేసిన పీ రాజేశ్వరరావు మరణంతో పుస్తకం పెద్దదికును కోల్పోయినట్లు అయిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ చెప్పారు. సోమవారం రాజేశ్వరరావు అంతిమయాత్ర సందర్భంగా మన్సూరాబాద్లోని ఆయన నివాసం వద్ద పుస్తక ప్రియులతో సభ జరిగింది.
ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ 50 సంవత్సరాలపాటు పుస్తక ప్రపంచంలోనే జీవించి, పుస్తకాలను ప్రజలకు చేరువ చేయడంలో రాజేశ్వరరావు కృషి మరువలేదని తెలిపారు.