హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మానవీయంగా స్పదిస్తూ జనరంజక పాలనను అందిస్తున్నది. వివిధ కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో స్పందిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలోని అనాథలకు తల్లి, తండ్రిగా సర్కారే మారనున్నది. ఇప్పటికే అనాథలకు అండదండలు అందిస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం వేయని సాహసోపేత అడుగు వేసింది. సీఎం కేసీఆర్ అనాథలను ఆదుకోవడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని వేశారు.
ఈ కమిటీ ఇప్పటికే రెండు, మూడు విడతలుగా మేథోమథనం చేసింది. ఈ రోజు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ లోని శిశు విహార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సహా పలు విభాగాల్లో ఉన్న అనాథ పిల్లలని కలిసి వారి సాధక బాధకాలను నేరుగా తెలుసుకుంటున్నది.
అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని మంత్రుల సబ్ కమిటీలోని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మంత్రులు, ఉన్నతాధికారుల బృందం సమావేశమై..పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడి హత్య
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ